Tuesday, December 29, 2009

చాదు బొట్టు - చుక్క నీరు.

చాదు బొట్టు - చుక్క నీరు.

మాది చాల చిన్న గ్రామం. అంద్ర్హ్ర లో నెల్లూరు ప్రక్కన గ్రామం . నాకు ఒకటిన్నర వయసునుండి , నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెరిగాను. మా అమ్మమ్మ వాళ్ళది ఉమ్మడి కుటుంబంగా ఉండి, మగ వాళ్ళ పనుల దృష్ట్యా వేరు వేరు ఊర్లలో వున్నారు. మూడు మైళ్ళ దూరం లో మా పెద్ద తాతగారి ఇల్లు ఉంది. వాళ్ళకి కొంచెం పొలం కూడా ఉంది. మేము అక్కడికి, వాళ్ళు ఇక్కడికి వస్తూ పోతూ ఉంటాము. మా పెద్ద అవ్వ పేరు సీతమ్మ.ఆమె భలే కధలు చెప్పేది.
ఒక పులుసులో బద్ద కధ ఇంకా మాకు జ్ఞాపకం ఉంది. తలచుకుకంటే ఏమిటో పిచ్చిగా నవ్వు వస్తుంది. ఒకసారి మా పెద్దవ్వ, మనుమడు , మనుమరాలు రాజ. ముగ్గురూ వచ్చి రెండు రోజుల తర్వాత తిరిగి బయలు దేరుతున్నారు. అప్పుడు నేను మా అవ్వ కూడా అక్కడికి వెళ్లి రెండు రోజులు వుండి వస్తామని వాళ్ళతో పాటు బయలుదేరాము.
మాకు పెరటి లో ఒక బావి వుంది. వాకిట్లో ఒక బావి వుంది. వాకిటి బావిలో కొంచెం నీరు తక్కువ లోతు వుంటుంది. బయటి వాళ్ళు కూడా వాడుతారు కాబట్టి ఒక చేద ఎప్పుడూ బావి పక్కనే వుంటుంది. తలుపులు తాళం వేసిన తర్వాత అమ్మాయీ బొట్టు ఎందుకు పెట్టుకోలేదే. అని అడిగింది.పెద్దవ్వ. అవ్వా చిన్నదిగా వుంది అవ్వాఅని బదులు చెప్పింది.
కంటికి కనపడకుండా నా ? వెళ్లి చాదు తీసుకుని పెద్దది పెట్టుకురా. అంది . సరి, అని తాళం తీసి, చాదు తీసుకుని వస్తే ఎండి పోయి వుంది.
ఇప్పటి మాదిరి stickerlu కాదు కదా? అచ్చం సబ్బుబియ్యం మాడ్చి, నీళ్ళు పోసి కాచి ,టెంకాయ చిప్ప లో పోసిందాయే.బాగా ఎండి పోయి వుంది. దానిలో రెండు చుక్కలు నీళ్ళు పోసి వేలితో చాదాలి. ఊరికి వెళ్తున్నాము కాబట్టి
అన్ని పాత్రలుబోర్లించి పెట్టేసాము. కావలిసిన రెండు చుక్కల నీళ్ళు లేవు. ఇంతలో రాజమ్మ అవ్వా నీళ్ళు నేను తెస్తాను అంటూ గబా గబా పరుగెతుకుని వెళ్లి చేద బావిలో వేసింది. ఆ వేసిన స్పీడుకు ఆ అమ్మాయి కూడా బావిలో పడి పోయింది. కింద నీళ్ళలో పడ్డ రాజ దర్జాగా ఒక్క మునక వేసి , ఎదురు ఒరకు కాళ్ళు తన్ని స్తిమతంగా కూర్చుంది. బావిలో. రెండో మునక వేయలేదు. ఒక్క క్షణం పైన వున్న ఎవరికీ కాళ్ళు చేతులూ, ఆడలేదు. తేరుకుని, అందరూ కేకలు పెట్టేసరికి ,వీధిలో వెళ్తున్నవారూ, బయట కూర్చున్నవారూ అందరూ వచ్చి, చాంతాడు ఒకటి వేసి పైకి తీసుకు వచ్చారు. ఎంత ధైర్యం గ వుంది రాజ .బయట వున్న మాకు కాళ్ళు చేతులు చల్లగా పోతున్నాయి. పెద్దవ్వకు నోట మాట రాలేదు. అట్టేనిలచి పోయింది.

చిన్నవ్వ ఈ లోపల రాముడి కి 108 టెంకాయలు కొట్టేస్తాను అని మొక్కుకునేసింది. ఎందుకంటే వూళ్ళో వాళ్ళ పిల్లకు ఎమన్నా అయితే బదులు చెప్పాలి కదా? ఇదీ ఆమె కష్టం. నేను , శివరాము బిక్క ముఖాలు వేసుకుని చూస్తున్నాము. మా ప్రయాణం రెండు రోజులు వాయదా పడింది. ఈ సంఘటన జరిగి 40 సంవత్సరములు దాటింది.
తలచుకుంటే ఒక్కొక్క సారి భయం వేస్తుంది. ఆ సమయం లో దేవుడు మన పక్కన వున్నాడు కాబట్టి సరిపోయింది. ఎందుకు ఆ సంఘటన జరిగింది . ఏదో మంచికే జరిగి ఉంటుంది బొట్టు పెట్టుకోవడానికి ఒక రెండు చుక్కలు నీటికోసం జరిగన సంఘటన.

తరువాత ఆ సంఘటనను నవ్వుతూ తలంచు కుంటున్నాము.

నమస్కారమండి శేషయ్యగారూ,

కొన్ని సంఘటనలను జీవత కాలంలో మరచి పోలేము.
మేము madras లో mount road సెంటర్ లో ఒక ఇంట్లో వుండే వాళ్లము.
అది ఇల్లు అని చెప్పేదానికంటే ఒక చిన్న చర్చి లాంటి ఒక పెద్ద బంగ్లా.
బ్రిటిష్ వాళ్ళ period లో కట్టినటువంటి , శిల్పుల ఇల్లు. అది మాకు 1953 లో
ఇల్లుగా దొరికింది. రాత్రి పూట ఆ ఇంట్లో నడవ్వాలి అంటేనే మాకు
భయంగా వుండేది. అప్పుడు నేను మా అక్కయ్య , మా తమ్ముడు ,
మా చెల్లెలు వుండే వారము. చెల్లెలు 1సం. పాప. తమ్ముడు 4 సం.ల వాడు.
నాకు 7 సం మాఅ క్కయ్యకు 10 సం .
ఆ ఇంటి వెనుక పెద్ద వేప చెట్టు వుండేది. పగులు చూస్తేనే మాకు చాల భయం గా
వుండేది. మధ్య రాత్రి వేళలో మేము బాత్రూం వెళ్ళాలంటే ఒకరినొకరు
తోడుకు లేపుకొనే వాళ్ళం. లేచి బయట తలుపు వరకు రావాలి అంటే కనీసం 15 అడుగులు
నడవవలసి ఉంటుంది . బయట వచ్చిన తర్వాత కూడా ఒక 10 అడుగులు నడవ్వాలి.
ఒక రోజు రాత్రి రెండూ - రెండున్నర మధ్యలో ఒకరినొకరు లేపుకొని నేను మా అక్కయ్య
ఇద్దరమూ మెల్లిగా బయటకు వచ్చాము. పది అడుగుల వరండా లో నడుస్తున్నాము..
ఇంతలో మాకు వెనుక నుంచి ఒక గొంతు వినిపించింది

నమస్కారమండి శేషయ్య గారూ అని మా అక్కయ్యకు
శేషయ్యగారూ బాగున్నారా అని నాకు ఒకేసారి వినిపించింది.
అంతే ఇద్దరమూ భయపడి పరుగో పరగు .లోపలి వచ్చేసాము.
ఆ తర్వాత 77 వరకు అదే ఇంట్లో వున్నాము . కాని ఆ విధంగా రాత్రి
పూట బయట వెళ్లలేదు. ఆ సంఘటన మేము మూడో వాళ్లకు కూడా
చెప్పలేకపోయము. కారణం మా ఇద్దరికీ వేరు వేరు పదాలు వినపడింది.
ఇద్దరమూ వాళ్ళ వాళ్లకు వినపడింది కాదు అని చెప్పలేక పోయాము.
ఈ దినం తలచు కున్న కూడా ఒళ్ళు జలబరిస్తుంది భయంతోటి.
ఆ గొంతు ఎవరిదీ. ఎవరు ఒకేసారి రెండు పదాలు మాట్లాడారు.
ఆ వేప చెట్టు మీద ఎవరయినా వున్నారా? ఏమో? ? ? అన్ని ప్రశ్నలే.
ఎప్పుడయినా మేము ఇద్దరమూ వుంటే ఆ విషయం గురించి
మాట్లాడుకొని నవ్వుకుంటాము.

Tuesday, December 15, 2009

Thursday, December 10, 2009

అమ్మ పెట్టేది పెట్టాలి.

అమ్మ పెట్టేది పెట్టాలి.

కేకయ దేశపు రాజుకు , జంతువులు పురుగులు, పక్షులు
మాట్లాడే భాషలు అర్థమవుతుంది. శామిక మహర్షి నుండి
ఈ వరమును పొందిన రాజు , పక్షులు,మృగముల
సంభాషణ ను విని బయట గనుక చెబితే రాజు తల
వేయి ముక్కలు అవుతుంది అన్న జాగ్రత్త కూడా చెప్పి వున్నారు.
ఈ రాజు భార్య కేకయి. దశరధుని భార్య కైకేయి తల్లి.
ఒక రోజు రాజు రాణి అంతఃపుర తోటలో కూర్చుని
మాట్లాడుకుంటున్నారు. అప్పుడు అక్కడ ఒక చీమ ఒక బియ్యపు గింజను
తీసుకు వెళ్తూ వుంది. ఎదురుగా వచ్చిన ఒక చీమ , స్నేహితుడా !
నాకు చాల ఆకలిగా వుంది నాకు ఆ బియ్యపు గింజను ఇస్తావా? అని అడిగింది.
దానికి ఆ చీమ ఉచ్చ కులస్తుడవయిన నీవు హీన కులస్తుడయిన నా వద్ద
నుండి ఆహారము గ్రహించ కూడదు. అన్నది. ఆ సంభాషణ విన్న రాజు
చీమలకు కూడా కుల భేదాలు ఉన్నాయా అని పెద్దగా నవ్వాడు.
ప్రక్కన వున్న రాణికి ఆ నవ్వు వింతగా తోచి ఎందుకు నవ్వుతున్నారు అని అడిగింది.
రాజుకు వెంటనే శామిక మహర్షి చెప్పిన మాటలు గురుతుకు వచ్చి మాట మార్చాడు.
కాని రాణి వదల లేదు. రాణి మొండి పట్టు పట్టింది. రాజుకు ఏమి చేయాలి తోచ లేదు.
రాజు విధి లేక నేను గనుక చెపితే నా తల వేయి ముక్కలు అవుతుంది అని చెప్పాడు. కాని
రాణి నమ్మ లేదు. రాజు కు ఏమి చేయాలి తోచ లేదు. సుదీర్ఘ ఆలోచన తర్వాత రాణి తోటి ,
నేను కారణం చెపితే , నాకు మరణం సంభవిస్తుంది. అని చెప్పిన కూడా వినలేదు.
కాశిలో మరణం ముక్తిని ఇస్తుంది కాబట్టి అక్కడ చెపుతాను.అక్కడ మరణం సంభవిస్తే
నాకు ముక్తి అయినా దొరకుతుంది అని కాశి కి బయలుదేరినారు రాజు రాణి.
కాశికి వెళ్ళిన తర్వాత రాణి మరల నవ్వుకు కారణం అడిగింది. రాజు నొచ్చుకుంటూ
మూడు దినములు గడవు అడిగినాడు.తన విధిని గూర్చి చింతిస్తూ బయట వాహ్వాళికి
బయలుదేరినాడు.వెళ్తూ దారిలో రెండు మేకలు మాట్లాడుకోవడం విన్నాడు.
వానిలో ఆడుమేక మగ మేక తో అదిగో ఆ భావి పైన వుండే గడ్డి తెచ్చి ఇవ్వు . అలా ఇవ్వకపోతే
నేను నిన్ను వదలి వెళ్ళిపోతాను అని బెదిరించింది. అది విని కోపం తో మగ మేక ఎంత
పొగరు నీకు. .ఆ నీరు లేని భావిలో నేను గనుక పడ్డానంటే నా గతి ఏమవుతుంది.
అంటూ ఆడు మేకను ముట్టి కిందకు తోసివేసింది. తన తప్పు తెలుసుకున్న ఆడు మేక
మగమేకను మన్నింపు అడిగింది. అదివిన్న రాజు తన కర్తవ్యం గురుతుకు వచ్చింది.
నేరుగా ఇంటికి వెళ్లి , బెత్తం తీసుకుని రాణి మీదకు విసరుతూ రహస్యం అడుగుతావా?
రహస్యం అడిగావంటే చంపెస్తాను అంటూ కొట్టడం ప్రారంభించాడు. రాణి భయపడి
ప్రభూ ఈ దినం నుండి ఆ రహస్యం నాకు చెప్పవద్దు. ఏదీ మిమ్మల్ని అడగను . నన్ను
మన్నించండి. కొట్టడం ఆపండి అని ప్రాధేయపడింది .
రాజు రాణి కాశీ నుండి రాజ్యానికి తిరిగి వచ్చారు. ఇప్పుడు రాజు చాల స్థిమిత
పడ్డాడు. మనసు ప్రశాంతం గ వుంది.
మన మనస్సు కు పిడివాదం పట్టే గుణం వుంది. ఆ మొండి పట్టుదల వల్ల
చాల సార్లు మనం చాల నష్ట పోతాము.అల కాకుండా మనసు మొండి పట్టుదల గ వున్నప్పుడు
మనకు మనమే కట్టుబాట్లు విధించుకొని , ఆ మొండి తనం నుంచి బయట రావాలి.
అలా వస్తేనే మన మనస్సును మన కట్టుబాటులో వుంచుకొని కష్టాలనుండి బయట పడవచ్చు
ఈ కథ లో కేకయ రాజు అలాగే మనశ్శాంతి ని పొందాడు. .

Tuesday, December 8, 2009

Neela Megha Shyamudu Seetha Ramudu

నీల మేఘశ్యాముడు సీతారాముడు.

పద్మాక్షుడు అను రాజు మహాలక్ష్మిని తన కూతురుగా పొందాలి అని అనుకున్నాడు.
దానికోసరం విష్ణు మూర్తిని గురించి తపస్సు చేసాడు.
పద్మాక్షుని తపస్సుక్కు మెచ్చినశ్రీ మహా విష్ణువు ప్రత్యక్షమయి నాడు
.పద్మాక్షుని కోరికను నేరవర్చుతానని , ఒక దానిమ్మ పండు ఇచ్చ్చి
అదృశ్యమయినాడు రాజు ఆ పండుని ఇంటికి తీసుకు వెళ్ళినాడు.
దారిలో ఆ పండు పెద్దది అవుతూ వచ్చింది.
భయపడిన పద్మాక్షుడు ఆ పండును పగులకోట్టినాడు.
ఆశ్చర్యం!! దానిలో ఒక పాప వుంది..
అందంగా బొమ్మ మాదిరి వున్న ఆ పాపకు '' పద్మ''అని పేరు పెట్టినాడు.
పాప దిన దిన ప్రవర్ధమానంగా పెరుగుతూ వచ్చింది.
యుక్త వయసు వచ్చింది. రాజు స్వయంవర ఏర్పాటు చేసాడు.
అనేక దేశ ములనుండి రాజులు ఆ స్వయంవరములో పాల్గొన్నారు.
వారిలో రావణాసురుడు కూడా వున్నాడు.
స్వయంవరమునకు వచ్చిన రాజులు ఎవ్వరూ పద్మాక్షుని కి నచ్చ లేదు.
అప్పుడు పద్మాక్షుడు ''ఎవరయితే ఆకాశంలో వుండే నీలి రంగును
తమ శరీరం కి పూసుకుంటారో వాళ్ళ కి నా కూతురును ఇస్తాను''
అని విచిత్రమయిన ప్రకటన చేశాడు.భలే పోటి.స్వయమ్వరమునకు వచ్చిన
రాజులకు అందరికి కోపం వచ్చింది.పద్మాక్షుడు తన కూతురిని మాకు ఇవ్వడం ఇష్టం లేక
ఈ విధముగా ప్రకటన చేసాడు .రాజులందరూ మాకు మీ అమ్మాయిని ఇవ్వకూడదు అన్న వుద్దేశ్యం తో ఈ విధంగా
ప్రకటన ఇచ్చారు. ఇది కాకుండా , విలు విద్య ,బాణ విద్య ,బుద్ధి కుశలత , వీటిలో పరీక్షలు పెట్టండి.
వాటిలో మేము గెలిచి చూపిస్తాము. అన్నారు. కాని పద్మాక్షుడు
ఒప్పుకోలేదు అందరూ పరి పరి విధములు చెప్పి ప్రయత్నించారు కాని పద్మాక్షుడు ఒప్పుకోలేదు.
అది చూసి అక్కడ వున్న రాజులకందరికి విపరీతమయిన కోపం వచ్చింది.
అందరూ అంతఃపురములో దూరి కొల్లకోట్టారు. అప్పుడు వారి బారి నుండి
తప్పిచుకోవడానికి పద్మ అక్కడ వున్న అగ్ని గుండంలో దూరింది.
పద్మాక్షుడిని గెలిచిన రాజులు పద్మను వెతికినారు. కాని ఆమె ఎక్కడ కనపడలేదు.
విసిగిన రాజులు తిరిగి వెళ్లి పోయినారు.
ఈ సంఘటన జరిగి చాల సంవత్సరములుఅయిన తర్వాత అగ్ని గుండం లో నుంచి పద్మ బయటకు వచ్చింది.
అప్పుడు తాను పెరిగిన రాజ అంతఃపురము మట్టిలో కలసి పోయినది చూసి చాల కష్టపడినది.
అప్పుడు తన వాళ్ళకు ఏర్పడిన కష్టానికి పరిహారంగాశ్రీ మహా విష్ణువు గురించి తపస్సు చేయ ఆరంభించింది.
ఆ సమయంలో ఆకాశ మార్గమున వెళ్తున్న రావణుడు పద్మను చూశాడు.
రావణుడు పద్మ దగ్గరకు వచ్చి తనను వివాహ మాడమని కోరినాడు. ఆమె ఒప్పుకోలేదు.
అపుడామెను బలవంతముగా పిలుచుకు వెళ్లడానికి ప్రయత్నము చేశాడు
మరల తనను కాపాడుకొనుటకై పద్మ అగ్ని ప్రవేశం చేసింది
ఎలాగయినా సరే ఆమెను పొందాలి అన్న భావంతో, ఆమె అగ్ని ప్రవేశం చేసిన అగ్నిని
నీళ్ళు పోసి ఆర్పి వేసి ,. అక్కడి మట్టిని పెళ్ళగించి చూసాడు. అక్కడ నవరత్నములు
మాత్రం దొరికింది. వానిని ఒక పెట్టెలో పెట్టి అంతఃపురములోని పూజ గదిలో వుంచాడు.
కొంత కాలం గడచింది. ఒక రోజు ఆయన ఆ పెట్టెను తెరచి చూసాడు .
మళ్ళి ఆశ్చర్యం! ! ! ! అందులోవున్న పద్మ చిన్న పాప రూపంలో దోగాడుతూ వచ్చింది.
అప్పుడా పాప రావణునితో " రావణా , అనీతిగా , అధర్మంగా రాజ్యమేలుతున్నావు
నిన్ను నశింప చేయక వదలను.కాచుకొని వుండు. వినాశ కాలం చాల దగ్గరలో వుంది;''
అని శాపం ఇచ్చింది. ఆగ్రహించిన రావణుడు ఆ పాపను అప్పుడే చంపుటకు ప్రయత్నించాడు.
కాని , రాణి మండోదరి ఆ పాపను ఎక్కడయినా వదలి రమ్మని వేడుకుంది.
సరేనన్న రావణుడు ఆ పాపను అ పెట్టె లోనే పెట్టే చాల దూరము తీసుకువెళ్ళి, ఎక్కడయినా
నేలలో పాతి పెట్టి రమ్మన్నాడు. ఆ పెట్టెను రాజ సిబ్బంది మిధిలాపురి అన్న చోట
పాతి పెట్టి వచ్చారు.
మిధిలాపురి రాజు జనకుడు. ఆయన ఒక యజ్ఞం చేస్తూ బంగారు నాగలి తో ,
యజ్ఞ కార్యముగా పొలము దున్నుచుండెను.అప్పుడు నాగలికి ఒక పెట్టె తగిలింది.
రావణుని చేత పాతి పెట్ట బడిన పెట్టె అది. ఆ పెట్టెలో దొరికిన పాపను జనకుడు పెంచుకున్నాడు.
ఆ పాపకు '' సీత'' అని పేరుపెట్టుకున్నాడు. యుక్త వయసు తర్వాత ,
జనకుడు ఆ సీతను నీల మేఘ శ్యాముడయిన రాముడికి ఇచ్చి వివాహం చేసాడు.
రావణుడు సీత శాపం వల్ల అంతం లో రాముని చేతిలో మరణించాడు.
ఆ నీల మేఘ శ్యాముడే శ్రీరాముడు. సీతారాముడు.